Pages

Sunday, 14 September 2025

D.El.Ed TEXT BOOKS 1st year

lm

D.El.Ed TEXT BOOKS


FIRST SEMESTER & SECOND SEMESTER :

NAME OF THE TITLEPAPER CODETELUGU MEDIUMENGLISH MEDIUM
Pedagogy of Mother Tongue/First Language at Primary Level101 & 201



Pedagogy of Mathematics at Primary Level102 & 202
Pedagogy across Curriculum & ICT Integration103 & 203
Childhood & the Development of the child104 & 204
Society, Education & Curriculum



105
Early childhood care & Education 



106
Towards Self- Understanding 107 & 405

Proficiency in English



108 


Art & Cultural Education




 205


Friday, 5 September 2025

AP TET DSC 3 వ తరగతి TELUGU

lm
AP TET DSC 3 వ తరగతి TELUGU

3 వ తరగతి
నూతన తెలుగు వాచకం


◆తెలుగు తల్లి గేయ రచయిత శ్రీశ్రీ.
◆శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు.
◆శ్రీశ్రీ రాసిన మహా ప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పింది.
◆శ్రీశ్రీ స్వీయ చరిత్ర పేరే అనంతం.
◆తల్లీ భారతి వందనం గేయ రచయిత- దాశరథి కృష్ణమాచార్యులు.
◆ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా దాశరథి కృష్ణమాచార్యులు పనిచేశారు.
◆దాశరథి కృష్ణమాచార్యుల స్వీయ చరిత్ర పేరు యాత్రా స్మృతి.
◆లియోటాల్ స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకులు.
◆లియోటాల్ స్టాయ్ యుద్ధం శాంతి, అన్నాకెరినీనా లాంటి రచనలు చేశారు.
◆పరమానందయ్య అనే పండితుడు కళింగ రాజ్యంలో ఉండేవారు.
◆పరమానందయ్యకు 12 మంది శిష్యులు ఉండేవారు.
◆పరమానందయ్య స్నేహితుడి పేరు పేరయ్య.
◆ఒక జింక నీళ్లు తాగడానికి సెలయేరు దగ్గరకు వెళ్ళింది.
◆జింక కథ ఈసఫ్ కథల్లోనిది.
◆ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి పొందాయి.
◆ఈసఫ్ కథలు 2500 సంవత్సరాల నాటివి.
◆’మంచిబాలుడు’ పాఠ్యభాగం సహానుభూతి అనే ఇతివృత్తానికి చెందింది.
◆మంచిబాలుడు అనే పాఠం గేయ కథ ప్రక్రియకు చెందింది.
◆మంచిబాలుడు గేయ కథ రచయిత ఆలూరి బైరాగి,
◆మానవుడి అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించిన కవి ఆలూరి బైరాగి,
◆ఆలూరి బైరాగికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డ్ లభించింది.
◆ఆలూరి రచనలు చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్యభవనం మొదలైనవి.
◆కలపండి చేయి చేయి పాట రచయిత- శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి,
◆ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచిన కవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి,

◆రాయప్రోలు సుబ్బారావు గారికి అభనవ నన్నయ, నవ్య కవితా పితామహుడు అనే బిరుదులు ఉన్నాయి.
◆’తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, వనమాల’ రాయప్రోలు సుబ్బారావు రచనలు
◆భారత ప్రభుత్వం సుబ్బారావు గారిని పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.
◆’ఏ దేశమేగినా, ఎందుకాలిడినా’ గేయాన్ని రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు.
◆1893 సెప్టెంబరు 11వ తేదీన షికాగోలో కొలంబస్ హాలులో సర్వమత మహాసభలో స్వామి వివేకానందుడు చక్కని ఉపన్యాసం ఇచ్చారు.
◆”ప్రార్థనలు, కర్మకలాపాలు చిత్తశుద్ధికి పనికి వస్తాయి. విగ్రహారాధన ధ్యానానికి ఉపయోగపడుతుంది. భగవంతుని దర్శనం లభించాలంటే ముందు మనలోని అహంకారం నశించాలి” అని వివేకానందుడు అన్నారు.
◆’సాయం’ ఒక అనువాద కథ.
◆జాక్కోప్ దక్షిణాఫ్రికాకు చెందిన కవి, కథకుడు, నవలారచయిత.
◆”అమ్మా! అటుచూడు ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది” అన్నాడు రవి.
◆సాయం పాఠంలో ఇతివృత్తం పరోపకారం (భూతదయ).
◆తన దేహాన్ని కోసి ఇచ్చి పావురాన్ని కాపాడిన చక్రవర్తి శిబి చక్రవర్తి.
◆”బాపూజీ! మీరు మట్టిలో మాణిక్యాలు వెలికి తీయగలరు. అందువల్లనే మీరు మహాత్ములు. మీ భావాన్ని అందుకోలేక నవ్వినందుకు నన్ను మన్నించండి” అని బాపూజీ పాదాలను స్పృశించారు మహాదేవ్ జీ.
◆కరుణశ్రీ పిల్లలకోసం తెలుగుబాల శతకం రచించారు.
◆జంధ్యాల పాపయ్యశాస్త్రి కరుణశ్రీగా ప్రసిద్ధులు.
◆’జమదగ్ని’ అనే కలం పేరుతో చెరుకుపల్లి జమదగ్నిశర్మగారు రచనలు చేశారు.
◆పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా జమదగ్నిగారు కథలను రాశారు.
◆కొండవాగు పాఠ్యాంశం లేఖ ప్రక్రియలో ఉన్నది.
◆’చూడాలనుకోవాలే గానీ ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనదే. వినాలనుకోవాలేగానీ ప్రకృతిలో ప్రతి శబ్దం అద్భుతమైనదే’ ఈ వాక్యాలు కొండవాగు పాఠంలోనివి.
◆’జననీ జనకుల గొలుచుట
◆తనయునకును ముఖ్యమైన ధర్మము జననీ’ పద్య పాదాలను శ్రీనాథుడు రచించాడు.

◆దేవులపల్లి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు.
◆దేవులపల్లి రచనలు – కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం.
◆అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం దేవులపల్లి వారి కవిత్వ లక్షణాలు.
◆ఇక్షు సముద్రం అంటే చెరుకు రస సముద్రం.
◆నా బాల్యం పాఠం ఆత్మకథ ప్రక్రియకు చెందింది.
◆నాజర్ని వాళ్ళ తాత అబ్దుల్ అజీజ్ అని పిలిచే వారు.
◆పాఠశాల వార్షికోత్సవంలో నాజర్ వేసిన నాటకమే ద్రోణ విజయం.
◆బుర్రకథ పితామహుడు షేక్ నాజర్.
◆నాజర్ గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి, 5న జన్మించారు.
◆నాజరు భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ అవార్డ్ ఇచ్చింది.
◆నాజర్ జీవిత కథకు ‘పింజారి’ అని పేరు పెట్టింది అంగడాల రమణమూర్తి గారు.
◆నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బీనాబీ,
◆కొండపల్లి బొమ్మల్ని ‘పొణికి’ కర్రతో తయారు చేస్తారు.
◆కృష్ణాజిల్లా కొండపల్లి కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి.
◆బంగారు పాపాయి పాట రచయిత మంచాళ జగన్నాథరావు.
◆’చూశావా! రాజా! ఈ యొక్క నాటిన రోజే బంగారు కాసులు కాసింది’ అని తాత సంబరపడ్డాడు.
◆పొడుపు విడుపు సంభాషణ ప్రక్రియకు చెందిన పాఠం.
◆పొడుపు విడుపు రచయిత చింతా దీక్షితులు.
◆గిరిజనులు, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత చింతా దీక్షితులు,
◆చింతా దీక్షితుల రచనలు – ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్కపిడతలు మొదలైనవి.
◆చందమామ పాట రాసిన కవి నండూరి రామ్మోహనరావు.
◆నండూరి రామ్మోహన్రావు రచించిన బాల గేయాల సంపుటి పేరు హరివిల్లు.
◆నండూరి రచనలు – నరావతారం, విశ్వరూపం. వీటి ద్వారా సులభశైలిలో పాఠకులకు పరిచయం చేశారు.
◆వికటకవిగా పేరు పొందిన వారు తెనాలి రామకృష్ణుడు.
◆’ఢిల్లీ వెళదాం – రాజును చూద్దాం’ అని మేమే మేకపిల్ల అంది.
◆మేమే మేక పిల్ల పరస్పర సహకారం ఇతివృత్తానికి చెందిన కథ.
◆మే మే మేకపిల్ల కథ రచయిత ఆర్. శకుంతల,
◆తెలుగు తోట గేయ రచయిత- కందుకూరి రామభద్రరావు.
◆కందుకూరి రామభద్రరావు రచనలు లే మొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైనవి.
◆’బహుళ కావ్యములను పరికింపగా వచ్చు’ ఈ పద్యం వేమన రచించాడు.
◆వేమన 17-18 శతాబ్దాల కాలం నాటి కవి.◆సుమతి శతక కర్త బద్దెన, 13వ శతాబ్దం వాడు.
◆గువ్వల చెన్నడు 17-18 శతాబ్దాలకు చెందిన కవి, గువ్వల చెన్నా మకుటంతో శతకం రాశాడు.
◆జంధ్యాల పాపయ్యశాస్త్రి గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామ నివాసి,
◆జంధ్యాల పాపయ్యశాస్త్రి రచనలు- విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైనవి.
◆తెలుగు బాల శతకకర్త – జంధ్యాల పాపయ్య శాస్త్రి,
◆దువ్వూరి రామిరెడ్డి నెల్లూరు జిల్లా వాసి,
◆దువ్వూరి రచనలు – కృషీవలుడు, జలదాంగన, గులాబీ తోట, పానశాల మొదలైనవి.
◆తాళ్ళపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి,
◆తాళ్ళపాక తిమ్మక్క అసలు పేరు – తిరుమలమ్మ.
◆సుభద్రా కళ్యాణం రచించింది తాళ్ళపాక తిమ్మక్క
◆అందమైన పాట రచయిత- జి.వి. సుబ్రహ్మణ్యం.
◆తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేసినవారు- జి.వి. సుబ్రహ్మణ్యంగారు.
◆జి.వి. సుబ్రహ్మణ్యంగారి రచనలు వీరరసం, రసోల్లాసం మొదలైనవి.
◆దిలీపుడి భార్య పేరు – సుదక్షిణాదేవి.
◆దిలీపుడి కుమారుడు రఘుమహారాజు.
◆”ఓ రాజా! నీ ధర్మనిరతిని పరీక్షించడానికే మేం ఈ సింహాన్ని సృష్టించాము. నువ్వు మా పరీక్షలో నెగ్గావు. ఇక నీవు నిశ్చింతగా వెళ్ళవచ్చు” అని దిలీపునితో దేవతలు పలికారు.
◆’మా వూరి ఏరు’ ప్రకృతివర్ణన ఇతివృత్తంగా సాగిన గేయం.
◆’మా వూరి ఏరు’ గేయ రచయిత- మధురాంతకం రాజారాం.
◆రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400లకు పైగా కథలు రాసిన రచయిత- మధురాంతకం రాజారాం.
◆ఉత్తమ ఉపాధ్యాయుడిగా, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయిత మధురాంతకం రాజారాం.
◆పంటచేలు పాట రాసినది పాలగుమ్మి విశ్వనాథం.
◆పాలగుమ్మి విశ్వనాథం లలితసంగీతానికి ప్రచారం కల్పించారు.
◆’బుద్ధిబలం కథ’ – పంచతంత్ర కథలకు చెందింది.
◆’బుద్ధిబలం కథ’లో సింహం- కుందేలు పాత్రధారులు.
◆’తొలిపండుగ కథ’లో – “అబ్బా! పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇష్టమో” అన్నాడు ఆనంద్.
◆అరే! భలే ఉందే ఉగాది పచ్చడి.. తియ్యతియ్యగా పుల్లపుల్లగా.. చేదుచేదుగా అంటూ లొట్టలు వేసుకుతిన్నాడు. శామ్యూల్.
◆ఉగాది పచ్చడి షడ్రుచులతో ఉంటుంది.
◆ఉగాది పండుగను చైత్ర శుద్ధ పాడ్యమినాడు జరుపుకుంటారు.
◆తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలను తెలిపేది పంచాంగం.

◆సంవత్సరాలు 60 ఉంటాయి. మొదటిది ప్రభవ, చివరిది – అక్షయ.
◆తెలుగు నెలలు 12. వాటిలో మొదటిది చైత్రం చివరిది ఫాల్గుణం.
◆’అందాల తోట’ పాట కస్తూరి నరసింహమూర్తి గారు రచించారు.
◆’అందాల తోట’ అనే పాట పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుంచి తీసుకున్నారు.
◆’నక్కయుక్తి’ అనే జానపద కథ రచయిత శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి.
◆జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రసామ్రాజ్యం, రత్నలక్ష్మి శతపత్రం, కేనోపనిషత్తు వీరి రచనలు

Wednesday, 20 August 2025

Primary Telugu projects

lm



Monday, 11 August 2025

ప్రైమరీ తెలుగు పుస్తక సమీక్ష

lm


 నిర్మాణాత్మక మదింపు  టూల్ -1 



 3,4,5 తరగతులకు ఉపయోగపడే తెలుగు పుస్తక సమీక్ష 

సమీక్ష - 1 ( విద్య కంటే వివేకం మేలు)



సమీక్ష -2 ( సుమతి - కుమతి )



Sunday, 10 August 2025

2 గోపాల్ తెలివి

lm

AP State Syllabus 

4వ తరగతి తెలుగు సమాధానాలు

 2 గోపాల్ తెలివి


Textbook Page No. 7

చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.

AP Board 4th Class Telugu Solutions 2nd Lesson గోపాల్ తెలివి 1




ప్రశ్నలకు జవాబులు చెప్ప౦డి.

ప్రశ్న 1.
చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి ?
జవాబు:
చిత్రంలో ఐదు గొట్టెలు, వల, వల పైన మేత, చెట్లు, గొయ్యి, ఎండు కొమ్మలు.


ప్రశ్న 2.
పై చిత్రాల ఆధారంగా కథను చెప్ప౦డి?
జవాబు:
అది ఊరి చివరి ప్రదేశం. పశువులకు చక్కటి మేత దొరికే ప్రదేశం. అక్కడికి రోజూ ఐదు గొట్టెలు మేత కోసం వస్తూ ఉంటాయి.

ఒకరోజు అవి – చక్కగా పరచిన కంబళి మీద – సిద్ధంగా ఉన్న ఆహారాన్ని చూసి తింటానికి సిద్ధపడ్డాయి. కానీ అందులో ఒక గొట్టె వద్దని, ఆపాయం పొంచి ఉందని – దాని కోసం ఆ కంబళి మీదకు వెళ్ళ వద్దని, వారించింది.
కాని మిగిలిన నాలుగు గొట్టెలు ఆమాటలు పెడ చెవిన పెట్టాయి. ఆనాయాసంగా దొరికిన ఆ ఆహారం కోసం ఆ కంబళి మీదకు వెళ్ళాయి. వాటి బరువుకు – కంబళి కింద వాటికోసం త్వా ఉన్న గొయ్యిలో పడిపోయాయి.

అప్పుడు బాధపడుతూ…. ఆ నాలుగు గొట్టెలు వద్దని చెప్పిన ఆ ఐదో గొట్టెతో ఎలాగొలా రక్షించు మిత్రమా! అని కోరాయి.
తెలివైన ఆ ఐదో గొట్టె….. గబాగబా ఎక్కడినుంచో…కొన్ని ఎండిపోయిన కొమ్మలను తెచ్చి ఆ గోతిలో నుండి పై దాకా పడేసింది.
లోపల పడ్డ గొట్టెలు .ఎక్కటానికి అనుకూలంగా పడేసింది.
వెంటనే… లోపల నుండి ఒక్కొక్క గొట్టె గోతిలోంచి ఆ కంపమీదుగా గట్టెక్కాయి.. . .

నీతి:

‘1. ఆశ అనర్ధానికి కారణం.
2. కష్టపడకుండా వచ్చేది ఏదైనా నష్టానికి దారితీస్తుంది.
3. ఆలోచన లేని ఆచరణ అనర్ధదాయకం.
4. ఉపాయంతో అపాయాన్ని దాటగలం
5. ‘మంచి మిత్రుడే మనకు బలంAP
మంచి మిత్రుడే మనకు బలం.

ఇవి చేయండి

వినడం – ఆలోచించి మాట్లాడటం

ప్రశ్న 1.
ఢిల్లీ సుల్తానుకు వచ్చిన ఆలోచన ఏమిటి ?
జవాబు:
సామంత రాజులను రెండు ప్రశ్నలు అడగాలని ఢిల్లీ సుల్తాన్ కి ఆలోచన వచ్చింది.
అవి :

ఈ భూమి పొడవు ఎంత ? వెడల్పు ఎంత ?
ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి ?
ప్రశ్న 2.
సుల్తాను అడిగినది చిక్కు సమస్య. చిక్కు సమస్య అంటే ఏమిటి ? ఇలాంటివి మీరు విన్నవి చెప్ప౦డి.
జవాబు:
సూటిగా జవాబు చెప్పడానికి వీలులేని ప్రశ్నలు చిక్కు ప్రశ్నలు. ఇలాంటివి మరికొన్ని :

రావి చెట్టుకు ఆకులెన్ని?
వర్షంలో నీమీద పడే చినుకులెన్ని?
ఎకరం పొలంలో ఎన్ని బియ్యపు గింజలు పండుతాయి. “
ఒక లారీలో ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయి ?


ప్రశ్న 3.
‘గోపాల్ తెలివి’ కథను మీ సొంత మాటల్లో చెప్ప౦డి.
జవాబు:
ఒకసారి ఢిల్లీ సుల్తాన్ కి రెండు ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలని ఆలోచన వచ్చింది. వెంటనే సామంత రాజులందరినీ పిలిపించాడు. సభ తీర్చాడు. వచ్చిన సభలోని సామంతరాజులని ” ఈ భూమి పొడవు, వెడల్పు ఎంత?” ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి. అని రెండు ప్రశ్నలడిగాడు. ఆ ప్రశ్నలకు వారంతా ఆశ్చర్యపోయి ఒకరి ముఖం ఒకరు చూసుకొని – కావాలనే ఈ చిక్కు సమస్య ఇచ్చాడనుకున్నారు.
అందరూ, సుల్తాన్ – ఈ ప్రశ్నలకు జవాబులు – పండితులతో చిర్చించి చెప్తామన్నారు. అందుకు సరే వెళ్ళమన్నాడు సుల్తాన్. రాజులంతా వారి పట్టణాలకు వచ్చారు.

సామంతరాజుల్లో ‘మాల్వారాజు’ – జయచంద్రుడు. తన రాజ్యంలో పండితులందరిని పిలిపించి – సుల్తాన్ అడిగిన ప్రశ్నలను వినిపించి జవాబు చెప్పమన్నాడు. పండితులందరూ ఖంగు తిన్నారు. ఇంతలో జయచంద్రుడి ఆస్థాన విదూషకుడు గోపాల్ – ఆ ప్రశ్నలు విని ఒక్క క్షణం ఆలోచించి- ‘రాజా! నన్ను సుల్తాన్ దగ్గరకు పంపండి. నేను చూసుకుంటాను’ అన్నాడు.
అందుకు జయచంద్రుడు – గోపాల్ లో ” ఇది తమాషా కాదు తలలు పోతాయి.” . అని హెచ్చరించాడు. – అయినా ఫరావాల్లేదు పంపమని కోరాడు గోపాల్ – రాజు గోపాలను సుల్తాన్ దగ్గరకు పంపాడు.

గోపాల్ సుల్తాన్ వద్దకు వెళ్ళి వందనం చేసి, తానెవరో ఎందుకొచ్చాడో చెప్పాడు. మహాప్రభూ! ఇంతటి చిక్కు ప్రశలకు జవాబు చెప్పాలంటే – బోలెడంత ధనమూ, సమయమూ ఖర్చు అవుతుంది. అని చెప్పాడు. వెంటనే సుల్తాన్ తగినంత డబ్బు ఇచ్చి సంవత్సరం గడువు ఇచ్చి పంపాడు. తగిన జవాబులతో రాకపోతే కఠినశిక్ష తప్పదన్నాడు.

డబ్బుతో తన పట్టణానికి వచ్చిన గోపాల్ రాట్నాల వాళ్ళని పిలిచి చేతనైనంత దారం వడకమని డబ్బిచ్చాడు.
సంవత్సర కాలం పూర్తి కావచ్చింది. రాట్నం వాళ్ళు వడికిన దారం మొత్తం (16)

పదహారు బళ్ళకు ఎక్కించి – (25) పాతిక గొట్టెలను తీసుకుని సరిగ్గా గడువు. రోజున గోపాల్ సుల్తాన్ గారి ముందు ప్రత్యక్షమయ్యాడు.

ప్రభూ! ఈ ఎనిమిది బళ్ళ దారం – భూమి నిలువు కొలత – ఈ ఎనిమిది బళ్ళ దారం భూమి అడ్డకొలత – ఇహ ఈ పాతిక గొట్టెల వంటి మీద ఎన్ని వెంట్రుకలున్నాయో! అవి నక్షత్రాలు. అని సుల్తాన్ గారి చిక్కు ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెప్పాడు. ఆ జవాబులను సుల్తాన్ నవ్వుకొని గోపాల్ ని సన్మానించి పంపాడు. తిరిగి వచ్చి గోపాల్ తన రాజైన జయచంద్రకి జరిగినదంతా చెప్పాడు.

ఎంతటి అపాయమునైనా – ఉపాయంతో జయించవచ్చని నిరూపించాడు.

పదజాలం

అ) పాఠం చదవండి. పాఠంలోని గుణింతాక్షర పదాలను రాయండి.
ఉదా.
1. పొడుగు ________
_____________
జవాబు:
1. పొడుగు
2. ఆలోచన
3. రాజు
4. సమాధానాలు
5. ముఖాలు.
6. వేసిన
7. విదూషకుడు
8. ఉపాయంతో
9. విషయం
10. భూమినంతా
11. ఆకాశంలో
12. పాతిక

ఆ) పాఠం చదవండి. పాఠంలోని ద్విత్వాక్షర పదాలను గుర్తించి రాయండి.
జవాబు:
1. వచ్చింది.
2. ఢిల్లీ
3. నిశ్శబ్దంగా
4. వాళ్ళు
5. చెప్పగలం
6. ఉన్న
7. పట్టణాలకు
8. సామంతుల్లో
9. చిక్కు
10. తప్పుడు
11. లెక్క
12. ఇక్కడికి

ఇ) పాఠం చదవండి. పాఠంలోని సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి.
జవాబు:
1. ఆశ్చర్యం
2. నిశ్శబ్దం
3. ఆలస్యం
4. ప్రభూ
5. దర్బారు
6. పూర్తి
7. ఇస్తున్నాను
8. నక్షత్రాలు
9. ప్రశ్న
10. నిశ్చింత
11. సుల్తాను
12. కూర్చున్నారు



పదాలు – అర్థాలు

దర్బారు = రాజసభ
విదూషకుడు = హాస్యగాడు
సామంతులు = రాజుకింద ఉండే చిన్న రాజులు

ఈ మాసపు గేయం


చూడగంటి


రాగం: బృందావని
తాళం : ఖండ

పల్లవి : కంటి నఖిలాండ కర్తనధికుని గంటి
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి ||

చ|| మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి
బహు విభవముల మంటపములు గంటి
సహజనవరత్న కాంచనవేదికలు గంటి
రహివహించిన గోపురంబులవె కంటి||

చ|| పావనంబైన పాప వినాశనము గంటి
కైవసంబగు గగన గంగ గంటి
దైవికపు పుణ్య తీర్థములెల్ల పొడగంటి
కోవిదులు కొనియాడు కోనేరు గంటి |

చ|| పరమయోగీంద్రులకు భావగోచరమైన
సరిలేని పాదాంబుజములు గంటి
తిరమైన గిరిచూపు దివ్య హస్తము గంటి
తిరువేంకటాచలాధిపు చూడగంటి ||

కవి పరిచయం

కవి : తాళ్ళపాక అన్నమయ్య
కాలము : (9-5-1408 – 23-2-1503)
విశేషాలు : పద కవితా పితామహులు. 32వేల సంకీర్తనలను రాశారని ప్రతీతి. వెంకటేశ్వరస్వామి కేంద్రంగా విశిష్ఠ సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. తేట తెలుగు పలుకుబడి, దేశీ పదసంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగిపొర్లుతుంటాయి.


ఈ మాసపు కథ 

విందు


ఒకరోజు సూర్యుడు, చంద్రుడు, వాయువు విందుకెళ్ళారు. వాళ్ల తల్లి నక్షత్రం, వాళ్లు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఆమె ఆత్రంగా ఎదరు చూడసాగింది.
సూర్యుడు, వాయువు అక్కడ విందులో వడ్డించినదల్లా కడుపునిండా మెక్కారు. ఇంకా ఏమున్నాయి, ఇంకా ఏమున్నాయి అని అడిగి తెలుసుకొని సుష్టుగా బోంచేసారు. వాళ్ళకు తింటున్నప్పుడు తల్లి ఒకసారి కూడా గుర్తుకు రానేలేదు. కేవలం కడుపే కైలాసంగా భావించారు తప్ప తమ తల్లి గురించి ఆలోచనే లేదు. అయితే చంద్రుడు మాత్రం తల్లిని మరచిపోలేదు. తన ముందుంచిన రుచికరమైన కొన్నింటిని తల్లికోసం జాగ్రత్తగా మూట కట్టుకున్నాడు. ఈ అని వాళ్లు విందు ముగించి ఇంటికి వెళ్లేసరికి అర్థరాత్రి దాటింది. అయినా తల్లి నక్షత్రం వాళ్లకోసం మేలుకునే ఉంది. బిడ్డలు ముగ్గురూ ఇంటికి రాగానే “ నాయనా నా కోసం ఏం తెచ్చారు మీరు?” అని అడిగింది ఆశగా.

అమ్మమాట విన్న సూర్యుడు కాస్త ఉలిక్కి పడుతూ “అయ్యో! నీకోసం నేనేమీ తేలేదమ్మా. వాళ్లు పెట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా!” అన్నాడు. కొడుకు మాటలు విన్న చుక్క తల్లి గుండె కలుక్కుమంది. ఆమె వాయువు వైపు చూసింది. అతడు ఇలా సమాధానమిచ్చాడు. “నేను కూడా నీ కోసం ఏమీ తేలేదమ్మా!” నేను సుష్టుగా భోంచేయడానికి వెళ్ళాను తప్ప నీకోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు” ఆ తల్లి హృదయం మరింత గాయపడింది. ఆమే వీడేం చెబుతాడో చూద్దామనికొని చంద్రుని వైపు చూసింది. చంద్రుడు తల్లితో ఇలా అన్నాడు. “అమ్మా! నువ్వొక పళ్ళెం తీసుకురా! నీకోసం అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను. నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకు వచ్చావంటే నమ్ము” చంద్రుడి మాటలు విన్న చుక్క తల్లి హృదయం నిండిపోయింది.

చుక్కతల్లి తర్వాత సూర్యుడివైపు తిరిగి ఇలా శపించింది. ” నువ్వు విందు ఆస్వాదిస్తున్నప్పుడు నీకు నీ తల్లి గుర్తుకురానందుకు నువ్వు సిగ్గుపడాలి. నువ్వు వట్టి స్వార్థపరుడవి. కనుక ప్రజలు నిన్నెప్పుడూ తిట్టుకుంటారు. నీ కిరణాల వేడి ప్రజలను బాధ పెట్టుగాక, నువ్వు తీవ్రంగా మండుతున్నప్పుడు నీ మొహం ఎవరూ చూడరుగాక చూడరు. నిన్ను చూడగానే నెత్తిమీద గుడ్డయినా వేసుకుంటారు లేదా గొడుగైనా అడ్డం పెట్టుకుంటారు”.

తర్వాత చుక్క తల్లి వాయువువైపు చూస్తూ ఇలా శపించింది. “నువ్వు కూడా స్వార్థజీవివి. విందు ఆస్వాదిస్తున్నప్పుడు నేను నీకు గుర్తుకు రాలేదు. ఎండాకాలం నీ వడ సోకి ప్రజలు బాధపడతారు. సూర్యుని వేడిని వడగాలిగా మార్చి జనాలను బాధ పెట్టే నిన్ను ప్రతి ఒక్కరూ నిందిస్తారు. నిన్నెవ్వరూ అభిమానించరుగాక!”

చివరన చుక్కతల్లి చంద్రుని వైపు తిరిగి ఇలా సౌమ్యంగా అంది. “బిడ్డా, విందు తింటున్నప్పుడు కూడా నన్ను మరువలేదు. తల్లిపట్ల నీకు కృతజ్ఞత ఉంది. ఇది అరుదైన, అమూల్యమైన సుగుణం. ఇక మీదట నువ్వు చల్లగా వుంటావు. నీ కిరణాలు ప్రజలకు హాయి, ఆనందం కలిగిస్తాయి. నిన్ను అందరూ ప్రశంసిస్తారు. నీ రాకకోసం ప్రజలు నిరీక్షిస్తారు. –

కవి పరిచయం

కవి : సోదుం రామ్మోహన్
కాలము : 2.03.1939 – 12.11.2008
విశేషాలు పత్రికా రచయిత, పలు రచనలు, అనువాదాలు చేశారు. నిఘంటు నిర్మాణం కూడా చేసారు. రెండు దశాబ్దాల పాటు ‘విశాలాంధ్ర’లో ఒక దశాబ్దం పాటు ‘ఉదయం’లో పని చేసారు.


AP State Syllabus 4th Class Telugu Solutions Chapter 1 గాంధీ మహాత్ముడు

lm

AP State Syllabus 4th Class Telugu Solutions
Chapter 1 గాంధీ మహాత్ముడు

Textbook Page No. 1

చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.

AP Board 4th Class Telugu Solutions 4th Lesson గాంధీ మహాత్ముడు 1

ప్రశ్నలకు జవాబులు చెప్ప౦డి.

ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరున్నారు వారేం చేస్తున్నారు?
జవాబు:
చిత్రంలో వీపున చిన్న పిల్లవాడి ని కట్టుకుని గుఱ్ఱం మీద స్వారీ చేస్తూ యుద్ధం చేస్తున్న వీరనారి, ఆమెతో యుద్ధం చేస్తున్న సైన్యం ఉన్నారు.

ప్రశ్న 2.
చిత్రంలో సన్నివేశం ఏమై ఉంటుంది ?
జవాబు:
స్వతంత్ర పోరాటం అయి ఉంటుంది. బ్రిటీష్ సైన్యాన్ని ఎదిరిస్తూ చెల్లాచెదరు చేస్తున్న ఆమె, వీరనారి ఝాన్సీరాణి అయి ఉంటుంది.


ప్రశ్న 3.
మీకు తెలిసిన సమరయోధుల పేర్లు చెప్ప౦డి.
జవాబు:
సైరా నరసింహారెడ్డి, ఝాన్సీరాణి, లాలాలజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బంకిన్ చంద్రపాల్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, గాంధీ, అల్లూరి సీతారామరాజు, సర్దార్ వల్లభాయ్ పటేల్, టంగుటూరి ప్రకాశం పంతులు, పింగళి వెంకయ్య మొదలగువారు….

Textbook Page No. 4

ఇవి చేయండి

వినడం – ఆలోచించి మాట్లాడటం

ప్రశ్న 1.
గాంధీ గురించి జగత్తు కలకల ఎందుకు నవ్వింది?
జవాబు:
గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్య సాధన కోసం బయలు దేరగా ఈ జగత్తు ఆనందంతో నవ్వింది.

ప్రశ్న 2.
స్వరాజ్యం అంటే ఏమిటి ?
జవాబు:
సొంత పరిపాలన, మనల్ని మనం పరిపాలించుకోవడం. పాలకులూ మనమే,,,, పాలితులు మనమే….

ప్రశ్న 3.
గాంధీ స్వాతంత్ర్య సమర నినాదాలే మంత్రాలుగా మారుమ్రోగాయి కదా! మీకు తెలిసిన కొన్ని స్వాతంత్ర్య నినాదాలు చెప్ప౦డి.
జవాబు:

  1. స్వరాజ్యం (స్వాతంత్ర్యమే) మా జన్మహక్కు – తిలక్
  2. జై హింద్ – సుభాష్ చంద్రబోస్
  3. మా కొద్దీ తెల్ల దొరతనం
  4. సత్యమేవ జయతే – గాంధీ
  5. పోరాడదాం – లేదా – చనిపోదాం (డు – ఆర్ డై) – గాంధీ
  6. దేశం వదిలిపోండి!…. (యూసఫ్ మెహార్లీ )
  7. వందేమాతరం …. (బకించంద్ర చట్టర్జీ )
  8. నాకు రక్తమివ్వండి – నేను స్వేచ్ఛను ఇస్తాను (సుభాష్ చంద్రబోస్)
  9. ఇంక్విలాబ్ జిందాబాద్ – ( భగత్ సింగ్ )

ప్రశ్న 4.
గడగడ వణకడం అంటే ఏమిటి ?
జవాబు:
భయపడిపోవడం.

ప్రశ్న 5.
గంట గణగణ మోగింది. ఇలా గంటలు ఎక్కడెక్కడ గణగణ మోగుతుంటాయో చెప్ప౦డి.
జవాబు:
దేవాలయాలలో, పాఠశాలలో, కళాశాలలో, ఆగ్నిమాపక వాహనం పై (ఫైర్ ఇంజన్) చిన్న చిన్న రైల్వే స్టేషన్లలో మొదలగు చోట్ల మోగుతుంటాయి.

కవి పరిచయం

కవి: బసవరాజు అప్పారావు
కాలము : 13-12-1894 – 10-06-1933
విశేషాలు : భావకవి, గీత కర్త, జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. ‘బసవరాజు అప్పారావు గారి గేయాలు’ పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయి.

పదాలు – అర్థాలు

స్వరాజ్యం : = సొంత పాలన
మోక్షం = విడుపు, విముక్తి
కంపించుట = వణుకుట
ప్రణవం = ఓంకారం
అధర్మం = అన్యాయం (ధర్మం కానిది)
స్వస్తి = శుభం

భావం

గాంధీ మహాత్మడు స్వాతంత్ర్య సాధన కొరకు బయలుదేరగా ఈ జగత్తు ఆనందంతో నవ్వింది గాంధీ స్వాతంత్ర్య సాధన కొరకు వేగంగా నడవగా ఈ భూమి కంపించిపోయింది. మహాత్ముడు కన్నెత్తి చూడగా అధర్మం గడగడ వణికిపోయింది. జాతిపిత బోసినవ్వు నవ్వగా స్వరాజ్యం కనుల ఎదుటే కనిపించింది. బాపూజీ మాట్లాడినపుడు ఓంకారం వలె గణగణ మ్రోగింది. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్య ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనెడి మోక్షము చేతికి చిక్కింది.

ఈ మాసపు గేయం : తేనెల తేటల మాటలతో

పల్లవి :

తేనెల తేటల మాటలతో

మన దేమాతనే కొలిచెదమా

భావం భాగ్యం కూర్చుకుని

ఇక జీవనయానం చేయుదమా

||తేనెల॥


చ|| 1)

సాగరమేఖల చుట్టుకొని

సురగంగ చీరగా మలచుకొని

గీతాగానం పాడుకోని

మనదేవికి యివ్వాలి హారతులు

||తేనెల॥

చ|| 2)
గాంగ జటాధర భావనతో
హిమశైల రూపమే నిలబడగా
గలగల పారే నదులన్నీ
ఒక బృందగానమే చేస్తుంటే
||తేనెల॥

చ|| 3)
ఎందరో వీరుల త్యాగఫలం
మన నేటి స్వేచ్చకే మూలధనం
వారందరినీ తలచుకొని
మన మానస వీథిని నిలుపుకొని
||తేనెల॥


కవి పరిచయం

కవి : ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
కాలము : (29-5-1944 – 25-07-2019)
రచనలు : ‘అనుభూతి గీతాలు’
విశేషాలు : కవి, కథకులు, విమర్శకులు. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. ఈయన కవితా సంపుటి. లలితగీత కర్త. ఆకాశవాణిలో పని చేశారు.


ఈ మాసపు కథ : తెలివైన దుప్పి

బోధిసత్వుడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు. అతనికి ఒక చెట్టు పండ్లంటే ఇష్టం. ఒక వేటగాడు ఇదంతా గమనించాడు. చెట్టు కింద బుట్టలో పండ్లు అమర్చాడు. దానికి ఒక ఉచ్చు అల్లాడు. చెట్టు మీద కూర్చోని దుప్పి కోసం ఎదురు చూస్తున్నాడు. దుప్పి వచ్చి పండు నోటితో అందుకోగానే వేటగాడు తాడు లాగుతాడు. దుప్పి ఉచ్చులో పడిపోతుంది. ఇది వాడి ఆలోచన.

దుప్పి రానే వచ్చింది. కాని దూరంగా ఆగింది. పండ్లు బాగా మగ్గి తీయని వాసన వస్తోంది. ఒక వైపు పండు తినాలని అనిపిస్తున్నది. కాని పండ్లు ఉన్న తీరు దుప్పికి సందేహం కలిగించింది. అది ముందుకు రాకుండా నిలబడి చూస్తూ ఉంది.

వేటగాడు దుప్పిని చూశాడు. అది ఆగి, నిలబడి ఉండడం గమనించాడు. వాడికి తొందరయిపోతోంది. దుప్పి వెనక్కి వెళ్లి పోతుంఏదేమో, దానికి పండ్లు కనబడాలని చెట్టు మీద నుండి కొన్ని పండ్లు విసిరాడు. ఒక్కొక్కటే తింటూ అది బుట్ట దగ్గరకు వస్తుందని వాడి ఆశ.

కాని దుప్పి చాలా తెలివైంది. చెట్టు నుంచి పండ్లు రాలితే సూటిగా కింద పడుతాయి. అంతేగాని ఎవరో విసిరినట్లు పడవు ‘కదా! ఏదో తిరకాసు ఉందని అర్థమయింది. చెట్టు మీద ఉన్న వేటగాణ్ణి చూసింది. కాని చూడనట్లే చెట్టుతో అన్నది. చెట్టూ! చెట్టూ! పండ్లు విసురుతున్నావేంటి? నీ అలవాటు మార్చుకున్నావా? అయితే నేను నా అలవాటు మార్చుకుంటాను. ఇక నీ దగ్గరకి పండ్ల కోసం రాను, అంటూ వెనుదిరిగి పోబోయింది. వేటగాడికి దుప్పి చిక్కలేదని కోపం వచ్చింది. గట్టిగా ఆరిచాడు. ఇవాళ తప్పించుకుంటే తప్పించుకున్నావు? రేపు నిన్ను వదిలేదు. లేదు.
వేటగాడు పూర్తిగా బయట పడి పోయాడు. మళ్లీ నీకు దొరుకుతానా అనుకుంటూ దుప్పి దట్టమైన అడవిలో మాయమై పోయింది. మోసగాళ్లుంటారు. వాళ్ల మాయలో పడకూడదు. ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది. జాగ్రత్తగా ఉండాలి.